శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 18 (మోక్షోపదేశ యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ భగవద్ గీతా సారం

<< అధ్యాయం 17

గీతార్థ సంగ్రహం లోని 22వ శ్లోకం లో, ఆళవందార్లు పద్దెనిమిదో అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “చివర్లో అనగా పద్దెనిమిదో అధ్యాయం లో – చెప్పినది ఏమనగా (అన్ని) కర్మలు చెయ్యువాడు స్వయముగా భగవానుడే, సత్త్వ గుణం అనుకరించతగినది మరియు సత్త్వ(ఇటువంటి నియమాలు పాటించి చేసే కార్యాలు) గుణ ప్రధానమైన ఇటువంటి కార్యాలకు ఫలితం మోక్షం. గీతా శాస్త్రానికి సారమైన భక్తి మరియు ప్రపత్తి చెప్పబడ్డాయి”.

ముఖ్యమైన శ్లోకాలు

శ్లోకం 1

అర్జున ఉవాచ. సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్చామి వేదితుం । త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశీనిషూధన ॥

ఓ మహాబాహు! ఓ ఇంద్రియాలను నిగ్రహించే వాడా! ఓ కేశి సంహారుడా! నేను సన్యాసం గురించి సత్యం తెలుసుకోవాలి అనుకుంటున్న (సన్యాసం, ఉపనిషత్తులలో మోక్ష మార్గం గా వివరించబడింది), త్యాగం మరియు అది ఒకదానికి ఒకటి వేరా (లేదా ఒకటేనా).

తర్వాత 2 శ్లోకాల్లో, కృష్ణుడు మొదటి శ్లోకం లో తలెత్తిన ప్రశ్నకు జ్ఞానులు అభిప్రాయం వివరించారు. కొందరు సాంసారిక ప్రయోజనాల కోసం చేసే కర్మలు పూర్తి గా త్యజించటం సన్యాసం అంటారు. కొందరు కర్మ ఫలాలు త్యజించటం సన్యాసం అంటారు. కొందరు లోపంగల కర్మలు త్యజించాలి అంటారు, కొందరు యజ్ఞం, దానం, తపస్సు ఎవరైనా త్యజించలేరు అంటారు.

4వ శ్లోకం లో, కృష్ణుడు ఈ విషయం లో తన పక్షం వివరించటం మొదలు పెట్టాడు..

శ్లోకం 5

యజ్ఞాదానతపః కర్మ నా త్యాజ్యం కార్యం ఏవ తత్ । యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం ॥

యజ్ఞం, దానం, తపస్సు వంటి వైధిక కర్మలు ముముక్షువులు ద్వారా (మోక్షం కోరేవారు) త్యజించలేనివి; అవి (చివరి వరకు) ఆచరించాలి; (ఎందుకంటే) మోక్షం కోరే ఉపాసకులకు అవి శుద్ధికారక పనులు (అవి ఉపాసన మార్గం లో దీర్ఘకాలిక విరోధులను తొలగిస్తాయి)..

తర్వాత శ్లోకం లో, తను కర్మల పైన ఎటువంటి కర్తృత్వం, యజమానత్వము మరియు ఫలితంతో అనుబంధం లేకుండా కర్మ చెయ్యాలి అని చెప్తున్నారు.

శ్లోకం 7

నియతస్య తు సన్యాసః కర్మణో నోపపాధ్యతే । మోహాత్ తస్య పరిత్యాగస్ తామసః పరికీర్తితః ॥

నిత్య కర్మలు (రోజు), నైమిత్తిక కర్మలు(నియమిత కాలం) త్యజించటం తగదు; దిగ్భ్రాంతి చేత కర్మ పరిత్యాగం చెయ్యటం (కర్మ లోపం అని ఆలోచన చేత), ఇటువంటి ఆలోచనలకు కారణం తామస గుణం (అజ్ఞానం).

8వ శ్లోకం మరియు 9వ శ్లోకాల్లో, రాజస గుణం చేత కర్మ పరిత్యాగం యొక్క ఫలితం మరియు కర్తృత్వాన్ని విడిచిపెట్టడం మరియు సత్వ గుణం వల్ల కలిగే కర్మల ఫలితం వివరించబడ్డాయి.

10వ శ్లోకం లో, కర్తృత్వ మరియు ఫలితం త్యజించే వారి స్వభావం వివరించబడింది.

11వ శ్లోకాల్లో, కర్తృత్వ మరియు ఫలితం త్యజించే వారు “త్యాగి” అని వివరించారు.

12వ శ్లోకంలో, ఇటువంటి త్యాగి, కర్మ ఫలితం అనుభవించడు అని, మరియు ఇతరులు కర్మ ఫలితాలు అనుభవిస్తారు అని వివరించారు.

13వ నుండి 15వ శ్లోకాల్లో, కర్మ ఆచరించటానికి, అయిదు కారణాలు వివరించారు, అవి 1) శరీరం, 2) ఆత్మా, 3) మనసు మరియు అయిదు కర్మేంద్రియాలు, 4) ప్రాణ వాయువు మరియు 5) పరమాత్మా.

16వ శ్లోకం మరియు 17వ శ్లోకాల్లో, తను, కర్తృత్వం గ్రహించని వారి స్థితి మరియు కర్తృత్వం సరిగ్గా అర్థం చేసుకున్న వారి స్థితులు వివరించారు.

18వ శ్లోకం లో, వైదిక కర్మల(వేదం అనుమతించిన కర్మలు) స్వభావం. కర్మకు, మూడు అంశాలు ఉన్నాయి – కర్మ గురించిన జ్ఞానం, కర్మ, మరియు కర్తా, అని వివరించారు.

19వ శ్లోకం లో, తను, ఈ అంశాలన్నీ, మూడు గుణాలు (సత్త్వ, రజస్, తమస్) ఆధారముగా భిన్నంగా ఉంటాయని వివరించారు.

20వ శ్లోకం నుండి 22వ శ్లోకం వరకు, మూడు గుణాల ప్రకారం జ్ఞాన స్థితులు వివరించబడింది.

23వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు, మూడు గుణాలు ప్రకారం కర్మ స్థితులు వివరించబడింది.

26వ శ్లోకం నుండి 28వ శ్లోకం వరకు, మూడు గుణాలు ప్రకారం కర్త స్థితులు వివరించబడింది.

29వ శ్లోకం లో, తను, బుద్ధి మరియు ధృతి( ధృడంగా నిలుచుట) కూడా మూడు గుణాల ప్రకారం ఉన్నాయి అని చెప్పారు.

30వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు, మూడు గుణాలు ప్రకారం బుద్ధి స్థితులు వివరించబడింది.

33వ శ్లోకం నుండి 35వ శ్లోకం వరకు, మూడు గుణాలు ప్రకారం ధృతి (దృఢ వైఖరి) స్థితులు వివరించబడింది.

36వ శ్లోకం లో, తను సుఖం (ఆనందం) కూడా మూడు గుణాల ప్రకారం ఉన్నాయి అని చెప్పారు.

37వ శ్లోకం నుండి 39వ శ్లోకం వరకు, మూడు గుణాలు ప్రకారం సుఖ స్థితులు వివరించబడింది.

40వ శ్లోకం లో, తను, ఈ సంసారంలో ఎవరు త్రిగుణాలకు అతీతులు లేరు అని ఈ విచారణను ముగించారు.

శ్లోకం 41

బ్రహ్మణాక్షత్రియవిషాం శూద్రాణాం చ పరంతప । కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్ గుణైః ॥

ఓ శత్రు నాశకుడా! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రులు, వారి (పూర్వ) కర్మల ఆధారంగా మరియు వారి కార్యాల వల్ల అని ప్రస్తావించబడింది (ఈ శాస్త్రం లో)

42వ శ్లోకం నుండి 44వ శ్లోకం వరకు, ప్రతి వర్ణం వారి స్వభావం మరియు గుణాలు వివరించబడింది.

శ్లోకం 45

స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః । స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్చ్రుణు ॥

తన వర్ణం అనుసరించి కర్మ చేస్తే, వాడు మోక్ష ఫలం పొందుతాడు; ఇప్పుడు తన వర్ణం అనుసరించి కర్మ చేసే వ్యక్తి, మోక్ష ఫలం ఎలా పొందుతాడో (నా నుంచి)(విను).

శ్లోకం 46

యతః ప్రవృత్తిర్ భూతానం యేన సర్వం ఇదం తథం । స్వకర్మణా తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ॥

మనుష్యుడు, తన వర్ణ ఆశ్రమం ప్రకారం పదార్థాలను, సృష్టి, స్థితులను చేసే పరమపురుషుడిని ,అన్నిట వ్యాపించిన పరమాత్మని ఆరాధిస్తారో, వారు పరమలక్ష్యమైన నన్ను పొందుతారు.

47వ శ్లోకం లో, తను, ఆత్మకు కర్మ యోగం స్వాభావికం కాబట్టి, పరిపూర్ణంగా జ్ఞాన యోగం చెయ్యటం కన్నా లోపాలతో కర్మ యోగం అనుసరించటం మేలు.

48వ శ్లోకంలో, తను, జ్ఞాన యోగం సాధన చేసేందుకు అర్హుడు అయినప్పటికీ కర్మ యోగం కూడా అనుసరించాలి అని చెప్పారు.

49వ శ్లోకం లో, తను, కర్మ యోగం చేసినప్పటికి జ్ఞాన యోగ ఫలితం అనగా ధ్యానం లో నిమగ్నం అవుతాడు అని చెప్తున్నాడు.

50వ శ్లోకం లో, అటువంటి పరిపూర్ణ ధ్యానం ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుందని ఆయన అంటున్నారు.

51వ శ్లోకం లో, ధ్యానం చేసే విధి విధానం వివరించారు.

శ్లోకం 54

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా నా శోచతి నా కాంక్షతి । సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ॥

ఎవరు అయితే వారి నిజమైన స్వరూపం తెలుసుకుంటారో, ఎవరికైతే మనసు వ్యాకులత చెందకుండా(నాకోసం తప్ప) , శోకించరో (నాకోసం తప్ప) కోరుకోరో(నన్ను తప్ప); (వైరాగ్యం తో) అన్ని సాంసారిక పదార్థాలు పట్ల సమానం గా వ్యవహరించి, పరమాత్మ అయిన నా పట్ల పరమ భక్తి పొందుతారు

వివరణం : ఈ శ్లోకం లో, పర భక్తి స్థితి పొందే మార్గం వివరించారు. మన సంప్రదాయం లో భక్తి లో మూడు దశలు వివరించారు – పరభక్తి (శుద్ధమైన జ్ఞాన స్థితి – భగవత్ సాంగత్యం ఆనందకరం, ఎడబాటు దుఃఖకరం); పరజ్ఞానం (మానసిక చిత్రీకరణ స్థితి – భగవానుడిని సంపూర్ణంగా మానసికంగా దర్శిస్తారు); పరమభక్తి (భగవంతుడి నుండి ఇంక ఎడబాయలేని స్థితి – పరమపదం లో భగవానుడిని చేరే కొంచం ముందర స్థితి).

శ్లోకం 55

భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చ అస్మి తత్త్వతః ల్. తతో మామ్ తత్త్వతో జ్ఞాత్వ విషతే తదనంతరం ॥

ఎవరికి అయితే నా పైన పరభక్తి ద్వారా, ఇట్టి స్వభావం దృష్టి కలిగి ఉన్నారో, ఇట్టి గుణాలు మరియు సంపద కాలిన వారు, నన్ను తర్వాత పరమభక్తి ద్వారా తెలుసుకుంటాడు, నన్ను పూర్తి గా పొందుతాడు.

వివరణం : ఈ శ్లోకం లో, పరజ్ఞానం మరియు పరమ భక్తి వివరించారు.

56వ శ్లోకం లో, తను, ఎవరు అయితే వర్ణాశ్రమ ధర్మం పాటిస్తారో, వారు క్రమముగా పరభక్తి, పరజ్ఞానం, మరియు పరమభక్తి పొందుతారు మరియు నన్ను చేరుతారు అని చెప్తున్నాడు.

57వ శ్లోకం లో, తను, అర్జునుడిని యుద్ధం ఎటువంటి కర్తృత్వం, యజమానత్వం మరియు ఫలితం పైన విచారణము లేక నాకు సమర్పణం గా చెయ్యమని ఉపదేశించాడు.

58వ శ్లోకం లో, తను, ఒకవేళ అర్జునుడు తన ఉపదేశించిన విధముగా ప్రవర్తిస్తే సంసార సాగరం దాటుతాడు, ప్రవర్తించ లేదా తన వినాశనానికి దారితీస్తుంది అని చెప్తున్నాడు.

59వ శ్లోకం మరియు 60వ శ్లోకలలో, తను, అర్జునుడు, ఈ యుద్ధాన్ని ఏ విధముగా కూడా తప్పించలేడు అని చెప్తున్నాడు.

శ్లోకం 61

ఈశ్వరః సర్వభూతానాం హృద్ధేశేఽర్జున తిష్టతి । భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ॥

ఓ అర్జునా! యంత్రం వంటి శరీరం కలిగిన అందరి హృదయం(జ్ఞానానికి ఆది) లో అన్నిటిని నియమించే వాసుదేవుడు ఉంటాడు, ఆ ప్రాణులను వాటి గుణాల ప్రకారం, ఆ గుణాలతో నిండిన ఈ మాయ(సంసారం- భౌతిక ప్రపంచం) లో ప్రవర్తింపచేస్తాడు.

శ్లోకం 62

తం ఏవ శరణం గచ్చా సర్వభావేన భారత । తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యాసి శాశ్వతం ॥

ఓ భరత వంశజుడా! పరమాత్మ (అయిన నన్ను) అన్ని విధాలుగా అనుసరించు; అతని కృప చేత, నీవు అన్ని బంధాలు నుండి మోక్షం మరియు శాశ్వతమైన మోక్ష నిలయమైన పరమపదం పొందుతారు.

63వ శ్లోకం లో, తన ఉపదేశాన్ని ముగిస్తూ అర్జునుడ్ని తాను ఆలోచించి, తన ఇష్ట ప్రకారం ప్రవర్తించమని చెప్పాడు.

64వ శ్లోకం లో, అర్జునుడు అంటే తనకి ప్రియము కనుక, తను మళ్లీ గుహ్యమైన భక్తి యోగం ఉపదేశించటానికి పూనుకున్నాడు.

శ్లోకం 65

మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మామ్ నమస్కూరు । మామ్ ఏవైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే ॥

నీ మనసు నా పైన నిరంతరం లగ్నం చెయ్యి; (అంతేకాక) నాపై గాఢమైనా ప్రేమ కలిగి ఉండు; నాకు ఆరాధన చెయ్యి నాకు (త్రికరణం అనగా మనసు, వాక్కు, శరీరం తో) నాకు నమస్కరించు; (ఇలా చెయ్యటం చేత) నీవు కచ్చితం గా నన్ను పొందుతావు; నేను నీకు సత్య ప్రమాణం చేస్తున్నాను; నువ్వు నాకు ప్రియమైన వాడవు (కనుక).

శ్లోకం 66

సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్ ఏకం శరణం వ్రజ । అహం త్వా సర్వపాపేభ్యో మోక్షాయిష్యామి మా శుచః ॥

అన్ని మార్గాలు పూర్తిగా త్యజించి, నన్ను ఒక్కడినే ఉపాయం అని తలచు; నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడను చేస్తాను; చింతించకు.

వివరణం : ఎంపెరుమానార్ (శ్రీ రామానుజులు) ఈ శ్లోకానికి రెండు వివిధ వివరణలు ఇచ్చారు. రెండు వివరణల్లో, ప్రపత్తి(శరణాగతి) భక్తి యోగం యొక్క అంగం(సహాయకం) గా పరిగణించారు. వారు ఈ విధముగా వేదాంతం అనుసరించే వారికి గీతా భాష్యం లో వివరించారు. కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయం అనుసరించే వారి కోసం రచించిన గద్య త్రయం లో (విశేషం గా శరణాగతి గద్యం లో), వారు శరణాగతి యొక్క గుహ్య వివరణం చెప్తూ, భగవానుడు మాత్రమే మోక్షానికి మార్గం అని వివరించారు.

మొదటి వివరణం :

ఎప్పడు అయితే గత శ్లోకం లో కృష్ణుడు, భక్తి యోగం లో వివరించినప్పుడు, అనేక పాపాలు విరోధాలు గా ఉండడం చేతా అర్జునుడు భక్తి యోగ సాధన యొక్క కాఠిన్యం చూసి చింతించాడో, అప్పుడు, కృష్ణుడు “ఒకవేళ నువ్వు కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు మూడు రకాల త్యాగాల(కర్తృత్వ, యజమానత్వం, ఫలితం) తో చేసినట్టు అయితే, నన్ను ఈ ఆరాధనకు ప్రేరేపకుడు ,ఆరాధనా వస్తువు మరియు ఆ పూజను ఆస్వాదించేవాడు, అనే భావన కలిగినట్లైతే మరియు నన్ను ఈ ప్రతిబంధకాలు నివారించువాడు (ఉపాయం) గా విశ్వసించినట్టు అయితే, నేను వాటిని నిర్మూలిస్తాను, చింతించకు!” అని చెప్పాడు.

రెండవ వివరణం :

ఎప్పుడు అయితే కృష్ణుడు గత శ్లోకం లో భక్తి యోగం వివరించారో, అందులో స్పష్టంగా విరోధాలు ఉన్నాయి అని తేటతెల్లమైంది, అందుకే అర్జునుడిలో మనస్సు కలత చెందాడు. ఒకరు విరోధ పరిహారం చెయ్యాలి అంటే ప్రాయశ్చిత్తం ఆచరించాలి. కానీ ప్రాయశ్చిత్తం చాలా కష్టతరం కనుక అర్జునుడు చింతించ సాగడు. అప్పుడు కృష్ణుడు, నీవు అన్ని ప్రాయశ్చిత్తాలు అని చెప్పబడే కర్మలు త్యజించ వచ్చు మరియు వాటి బదులుగా నన్ను భావించి, పట్టుకో. నేను నీ పాపలను (ఆ ప్రాయశ్చిత్తాల కన్నా శీఘ్రముగా) తొలిగిస్తాను, కావున నీవు చింతించకు.

శ్లోకం 67

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన । న చాశుశ్రూషవే వాచ్యం న చ మామ్ యోఽభ్యసూయతి ॥

ఈ శాస్త్రం (గోప్యముగా నీకు నా చే వివరించ బడింది) నీవు తపస్సు చెయ్యని వారికి వివరించ రాదు; (నాపై మరియు నీపై) భక్తి లేని వారికి వివరించరాదు; వినటానికి ఇష్టం లేని వారికి చెప్పరాదు, నన్ను ద్వేషించే వారికి కూడా వివరించరాదు.

శ్లోకం 68

య ఇదం పరమం గుహ్యం మధ్భక్తేశ్వభిదాస్యతి । భక్తిం మయి పరాం కృత్వా మామ్ ఏవైశ్యత్యసంశయః ॥

ఎవరైతే అతి గుహ్యమైన ఈ శాస్త్రాన్ని నా భక్తులకు వివరిస్తాడో, వారు నిస్సందేహం గా నన్న భక్తి గా ఆరాధించి నన్ను పొందుతాడు.

శ్లోకం 69

న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః । భవితా న చ మే తస్మాధన్యః ప్రియతరో భువి ॥

ఈ శాస్త్రం వివరించే వాడు చేసిన కైంకర్యం ప్రియమైన కైంకర్యం ఈ ప్రపంచంలో లేదు, ఇంకపైన కూడా వుండబోదు.

శ్లోకం 70

అధ్యేశ్యతే చా యా ఇమం ధర్మ్యం సంవాదం ఆవయోః । జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యాం ఇతి మే మతిః ॥

నా దృష్టి లో, ఎవరైతే మోక్షం ప్రసాదించే మన సంభాషణ పఠిస్తారో వారు జ్ఞాన యజ్ఞం ద్వార నన్ను ఆరాధించినట్టు (జ్ఞానం ద్వారా కైంకర్యం).

శ్లోకం 71

శ్రద్దవాన్ అనసూయశ్చ శృణుయాధపి యో నరః । సోఽపి ముక్తశ్ శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్య కర్మణామ్ ॥

ఎవరు అయితే వినాలి అని కోరికతో, అసూయలేని వారు మరియు ఈ శాస్త్రం కేవలం విన్నంత మాత్రం చేత, పాప విముక్తులు (భక్తి ఆరంభించటానికి విరోధాలు)అయ్యి , వారు అనేక సత్ కర్మలు చేసిన నా భక్త సమూహం లో చేరుతారు.

72వ శ్లోకం లో, కృష్ణుడు, ఈ శాస్త్రం విన్న అర్జునుడికి అన్ని సందేహాలు నివృత్తి అయ్యాయా లేదా అని ప్రశ్నిస్తుడు.

శ్లోకం 73

అర్జున ఉవాచ. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ ప్రసాదాన్ మయాచ్యుత । స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ॥

అర్జునుడు చెప్తూ – ఓ అచ్యుత! నీ అనుగ్రహం చేత నా అజ్ఞానం తొలిగింది; నిజమైన జ్ఞానం కలిగింది; సందేహ నివృత్తి కలిగింది, సత్యాన్ని గ్రహించి నేను దృఢముగా నిలిచాను; నేను నీ ఉపదేశాలను అనుకరిస్తాను (యుద్ధంలో పోరాడుతాను).

74వ శ్లోకం లో, సంజయుడు ఈ శ్రీ గీతా శాస్త్రం ముగిస్తూ “నేను కృష్ణుడు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ అద్భుతమైన సంభాషణ విన్నాను”.

75వ శ్లోకం లో, తను ఈ సంభాషణ నేరుగా శ్రీ కృష్ణుడు నుండి వ్యాస అనుగ్రహం చేత విన్నాను అని చెప్పారు.

76వ శ్లోకం మరియు 77వ శ్లోకం లో, సంజయుడు దృతరాష్ట్రుడికి, తను ఈ అద్భుతమైన సంభాషణం గురించి మరియు శ్రీ కృష్ణుడి విశ్వరూపం గురించి ఆలోచించిన ప్రతిసారి ఆనందభరితుడు అవుతున్నాడు అని చెప్తున్నారు.

శ్లోకం 78

యాత్ర యోగేశ్వరః కృష్ణో యాత్ర పార్థో ధనుర్ధరః । తత్ర శ్రీర్విజయో భూతిర్దృవా నీతిర్మాతిర్మమ ॥

ఎక్కడైతే కీర్తి అంతటికి ప్రభువు అయిన కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడ ధనుస్సు పట్టుకుని అర్జునుడు ఉన్నాడో, అక్కడ అన్ని సంపదలు, జయాలు, కీర్తి, ధర్మాలు బాగా స్థిరపడి ఉంటాయి; ఇది నా అభిప్రాయం

శ్రీ భగవద్ గీతా సారం అనే ఈ రచన సంపూర్ణం అయ్యింది.

అడియేన్ రామానుజ దాసన్

మూలము : https://githa.koyil.org/index.php/essence-18/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org