శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
గీతార్థ సంగ్రహం లోని 11వ శ్లోకం లో, ఆళవందార్లు ఏడవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “ఏడవ అధ్యాయం లో, పరమ పురుషుని యొక్క నిజమైన స్వభావం అనగా తను(భగవాన్) ఉపాసనా విషయం, ఆ (భగవత్ జ్ఞానం) నిఘూడ స్థితి (జీవాత్మకి) ,భగవంతుడికి శరణాగతి (ఆ నిఘుడత్వం పరత్రోలేది), నాలుగు రకాల భక్తులు, జ్ఞానులు గొప్పతనం (నాలుగు రకాల భక్తులలో) చెప్పబడింది.
ముఖ్యంమైన శ్లోకాలు
శ్లోకం 1
శ్రీ భగవాన్ ఉవాచ. మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః । అసంశయం సమగ్రం మామ్ యథా జ్ఞస్యాసి తచ్ఛుణు ॥
భగవాన్ చెప్తూ : ఓ కుంతి పుత్రుడా! భక్తి యోగాన్ని ప్రారంభించే నువ్వు , నాకు మనసు అంకితం చేసి మరియు నన్ను నమ్మి , నన్ను పూర్తి గా తెలుసుకునే జ్ఞానాన్ని (యోగం ద్వారా పొందే) గురించి నేను చెప్పేది శ్రద్ధగా విను.
వివరణం : కృష్ణుడు అధ్యాయం మొదలు పెట్టటమే శ్రద్ధగా వినటం ప్రధానం అనే అంశం చెప్తూ, తర్వాత శ్లోకం లో, తను చెప్తూ అర్జునుడికి తన గురించి మాత్రమే తెలుసుకోవాలి తప్ప తెలుసుకోవలిసిన మరి ఒక్క విషయం లేదు అన్న విషయాన్ని విపులంగా వివరించారు.
శ్లోకం 3
మనుష్యాణాం సహస్రేశు కశ్చిద్యతటి సిద్ధయే । యథాతాం అపి సిద్ధానాం కశ్చిన్ మామ్ వేత్తి తత్త్వతః ॥
శాస్త్రం నేర్చుకునేందుకు యోగ్యులు అయినా వేలల్లో ఒక్కరు మాత్రమే మోక్షం సాధించేందుకు నిరంతరం ప్రయాసపడ్తుంటారు. అందులోను వేలల్లో ఒక్కరు(నిరంతరం మోక్ష సాధన చేసే వారిలో) మాత్రమే నన్ను పూర్తిగా తెలుసుకుంటారు.
వివరణం : కృష్ణుడు ఈ జ్ఞానాన్ని పొగుడుతూ ఇది చాలా కష్టం అని చెప్తున్నారు.
శ్లోకం 4
భూమిర్ ఆపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిర్ ఏవచ । అహంకార ఇతీయం మే బిన్నా ప్రకృతిర్ అష్టధా ॥
ఎనిమిది రకాల భూతాలు అనగా భూమి, నీరు,అగ్ని,గాలి,ఆకాశం,మనసు(మరియు ఇతర ఇంద్రియాలు), మహాన్(మహత్ తత్త్వం – మహా భూతం) మరియు అహంకారం (మూల ప్రకృతి సూచించే అహం) కలిగి ఉన్న ప్రకృతి స్వభావం నాది అని తెలుసుకో.
వివరణం : మొదట కృష్ణుడు వివరిస్తూ అన్ని అచిత్(జడ) తత్త్వాలు తనవే అన్న విషయం తెలుసుకోమని చెప్తున్నాడు.
శ్లోకం 5
అపరేయం ఇతస్త్వన్యం ప్రకృతిం విధ్ది మే పరాం ల । జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ॥
ఓ మహాబాహు! ఈ అచేతనమైన ప్రకృతి హీనమైనది; జీవ(చేతనమైన తత్త్వం) అనే ఈ (పవిత్రమైన)తత్త్వం ఈ భౌతిక ప్రకృతి నుండి వేరు అయినది ఉత్తమమైన, అది నాది; ఈ జీవ(జీవాత్మల సమూహం) వల్లే ఈ విశ్వం కొనసాగుతుంది.
వివరణం : కృష్ణుడు అచిత్తులు అన్నీ జీవాత్మల ద్వారా ధరిస్తాడు. ప్రతీ అచిత్ వస్తువు జీవాత్మ కలిగి ఉంటుంది మరియు భగవంతుడు అంతర్యామి గా ఉంటారు. తర్వాత శ్లోకం లో కృష్ణుడు తనే ప్రతిదానికీ ఆది మరియు అంతం అయ్యి ఉందని చెబుతాడు..
7వ శ్లోకం లో , తను చెప్తూ “నాకంటే ఉత్తమమైనది లేదు; అన్ని తత్త్వాలు, హారం లో రత్నాలు పొందుపరిచినట్టు నాతో ముడిపడి ఉన్నాయి.”
8వ శ్లోకం మొదలు 12 వ శ్లోకం వరకు, తను వివరిస్తుంది ఏంటి అంటే తానే వివిధ తత్త్వాలలోని విశేష దశలకు తను నియామకుడు అని, ఇక్కడ తను ప్రత్యేక దశ అని చెప్పినప్పటికీ, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది తానే అటువంటి దశలకు మూలము.
13 వ శ్లోకం లో తను వివరిస్తుంది, తానే అన్నిటికి సృష్టికర్త అయినప్పటికీ, మూడు గుణాలు (సత్వ, రాజస్, తమో) చేత బాధించ పడటంచేత, ఈ లోకం లోని జనులు తనను అర్థం చేసుకోలేరు.
శ్లోకం 14
దైవ హ్యేషా గుణమయీ మామ మాయా దురత్యయా । మామ్ ఏవ యే ప్రాపద్యంతే మాయాం ఏతాం తరంతి తే ॥
ఈ భౌతిక ప్రకృతి/లోకం ఏదైతే నాదో, మరియు మూడు గుణాలతో నిండి ఉందో,దాన్ని దాటడం కష్టం(స్వ ప్రయత్నం చేత). ఎందుకు అంటే ఇది నా చే సృజించ బడింది . నేను దేవుణ్ణి. నాకు మాత్రమే శరణాగతి చేసిన వాళ్లు, ఈ భౌతిక ప్రకృతిని/లోకాన్ని (నా అనుగ్రహం చేత) దాటుతారు.
వివరణం : భగవానుడు శరణాగతి వైభవాన్ని ఈ శ్లోకం లో వివరిస్తున్నారు.
శ్లోకం 15
నా మామ్ దుష్కృతినో మూడః ప్రాపద్యంతే నరాధమాః । మాయయాపహృతజ్ఞానః ఆసురం భావం ఆశ్రితాః ॥
నీచులు, పురుషులలో అధములు, మాయ చేత నశింపబడ్డ జ్ఞానులు మరియు అసుర ప్రవృత్తి కలిగిన వారు నాలుగు రకాల పాపులు (క్రమంగా ముందు చెప్పబడ్డ వారికన్నా ఎక్కువ పాపం చేసిన వారు) నాకు శరణాగతి చేయని వారు.
వివరణం : నాలుగు రకాలైన ప్రతికూలమైన వారు ఇక్కడ వివరించ బడ్డారు .
శ్లోకం 16
చతుర్విధా భజంతే మామ్ జనాః సుకృతినోఽర్జున । ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థీ జ్ఞానీ చ భారతర్షాభ ॥
ఓ అర్జునా భరతుని వంశం లో శ్రేష్ఠమైన వాడా ! నాలుగు రకాల గుణాలు కలిగిన వారు ఒకరు బాధల్లో ఉన్నవారు (ధన నష్టం వల్ల), ఒకరు (కొత్త) ధన ఆశ కలిగిన వారు, ఒకరు ఆత్మ అనుభవం అనే ఆశ కలిగిన వారు మరియు నిజమైన జ్ఞానం కాలిగిన వారు, నన్ను పూజిస్తారు.
వివరణం : నాలుగు రకాల అనుకూలమైన వారు ఇక్కడ వివరించబడ్డారు.
శ్లోకం 17
తేషామ్ జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే । . ప్రియో హి జ్ఞానినోఽత్యర్థం అహం స చ మమ ప్రియః ॥
ఈ నలుగురి లో, జ్ఞాని మాత్రమే నాతో ఏకమై ఉంటాడు మరియు నాకు మాత్రమే భక్తి కలిగి ఉంటాడు శ్రేష్ఠుడు. అటువంటి జ్ఞానికి, నేను అంటే అత్యంత ప్రియం మరియు అతను అంటే నాకు ప్రియము.
వివరణం : జ్ఞాని యొక్క వైభవం (గొప్పగా నిష్ఠ కలిగిన భక్తుడు) వివరించారు ఇక్కడ.
శ్లోకం 19
బహూనాం జన్మనాం అంతే జ్ఞనవాన్ మామ్ ప్రపాధ్యతే । వాసుదేవః సర్వ ఇతి స మహాత్మా సుదుర్లాభః ॥
అనేకమైన పుణ్యమైన జన్మల తర్వాత, ఒక జ్ఞాని యొక్క జ్ఞానం పరిపక్వమైన ఆలోచన “వాసుదేవుడు, నాకు పరమ ప్రాప్యం (పరమ లక్ష్యం), ప్రాపకుడు (మార్గం), ధారకుడు (నన్ను ధరించే వాడు), పోషకుడు (నన్ను పోషించువాడు), భోగ్యుడు (నాకు సుఖాన్ని ఇచ్చేవాడు) మరియు ఇత్యాది” శరణాగతి చేయు వాడు. తను ఉదార మనసు కలిగిన వాడు మరియు నాకు కష్టము గా దొరకువాడు (ఈ ప్రపంచం లో).
వివరణం : భగవానుడు, సాధనం లక్ష్యం అని ఇక్కడ వివరిస్తున్నాడు.
రాబోవు అనేక శ్లోకాల్లో, కృష్ణుడు అన్య దేవతారాధకుల స్వభావాన్నీ, అలాగే జ్ఞానిని కనుకొనటం ఎంత దుర్లభమో అని కూడా చెప్తున్నారు.
శ్లోకం 21
యో యో యామ్ యామ్ తనుం భక్తః శ్రద్ధయార్చితుం ఇచ్చతి । తస్య తస్యాచలాం శ్రద్ధాం తాం ఏవ విధదామ్యాహం ॥
దేవతాంతరాల భక్తులు ఎవరైనా నా శరీరం అయిన దేవతలను పూర్ణహృదయం తో సేవించాలి అని కోరుకుంటే, నేను వారికి ఆ దేవత పట్ల మాత్రమే అచంచలమైన భక్తిని ప్రసాధిస్తాను.
శ్లోకం 23
అంతవత్ తు ఫలం తేశాం తద్భావత్యల్పమేదసాం । దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామ్ అపి ॥
అజ్ఞానులను ఆరాధించే వారి ఆరాధన నిష్ఫలం మరియు నశ్యం ; ఎందుకు అంటే దేవతంతరాలను ఆరాధించే వారు ఆయా దేవతలను పొందుతారు; మరియు నా భక్తులు నన్ను పొందుతారు.
28వ శ్లోకం లో, పుణ్య కార్యాలు చెయ్యటం వల్ల పాపలు నశించి, మళ్లీ భగవానుడిని ఆరాధిస్తారు అని వివరించారు.
29 వ శ్లోకం లో మోక్షాన్ని పొంద తలిచిన వారు, బ్రహ్మం , అధ్యాత్మం మరియు కర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి అని సెలవిచ్చారు.
శ్లోకం 30
సాధిభూతాధిదైవం మామ్ సాధియజ్ఞం చ యే విధుః ।. ప్రయాణకాలేఽపి ఛ మామ్ తే విధూర్ యుక్తచేతసః ॥
ఐశ్వర్యార్థులు (లౌకిక సంపద పైన ఆశ ఉన్నవారు) నేనే అధిభూతం మరియు అదిదైవం అని తెలుసుకోవాలి(ఇవి 8 వ అధ్యాయం లో వివరించారు); (అలాగే మిగిలిన ఇద్దరు [కైవల్యార్థులు (ఆత్మ అనుభవించే వారు) మరియు భగవత్ కైంకర్యార్థులు (భగవత్ కైంకర్యం పైన ఆశ ఉన్న వారు)]), వారు నన్ను అది యజ్ఞుడిగా తెలుసుకోవాలి; ఈ మూడు రకాల జనులు నన్ను వారి శరీరం వదిలే అప్పుడు స్మరించాలి(వారి లక్ష్యం చేరటానికి) [అంత్యాకాలం లో].
ఆడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
మూలము : https://githa.koyil.org/index.php/essence-7/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org