శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
గీతార్థ సంగ్రహం లోని 12వ శ్లోకం లో, ఆళవందార్లు ఎనిమిదవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “ఈ 8వ అధ్యాయం యొక్క సారాంశం, భౌతిక సంపద ఆశించే ఐశ్వర్యార్థులు, భౌతిక దేహం త్యజించి తమని తాము అనుభవించాలి అనుకునే కైవల్యార్థులు మరియు భగవద్ పాదాలు చేరాలి అనుకునే జ్ఞానులు, తెలుసుకోవాల్సిన వివిధమైన తత్త్వాలు గురించి చెప్పబడ్డాయి.”.
ముఖ్యమైన శ్లోకాలు
శ్లోకం 1
అర్జున ఉవాచ. కిమ్ తద్ బ్రహ్మ కిమ్ అధ్యాత్మం కిమ్ కర్మ పురుషోత్తమ । అధిభూతం చ కిమ్ ప్రోక్తం అధిదేవం కిమ్ ఉచ్యతే ॥
అర్జునుడు, “ఓ పురుషోత్తమ! బ్రహ్మం అంటే ఏంటి? అధ్యాత్మం అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? అధిభూతం అనబడేది ఏంటి? మరియు అది దైవం అనగా ఏంటి?” అని ప్రశ్నిస్తాడు.
వివరణం : అర్జునుడు కృష్ణుడ్ని భక్తులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సూత్రాల గురించి అడుగుతున్నాడు.
తర్వాత శ్లోకం లో, తను మూడు రకాల భక్తులు (ఐశ్వర్యార్థులు, కైవల్యార్థులు, భగవత్ కైంకర్యార్థులు) అందరూ తెలుసుకోవాల్సిన అది యజ్ఞం గురించి తెలపమని ప్రశ్నిస్తున్నాడు.
శ్లోకం 3
శ్రీ భగవాన్ ఉవాచ. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మం ఉచ్యతే । భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ॥
శ్రీ కృష్ణుడు చెప్తూ, “బ్రహ్మ” అనగా సమస్త ప్రకృతి నుండి విముక్తి పొందిన ఆత్మ; “అధ్యాత్మం” అనగా పదార్థం; ప్రసరించే (పురుష వీర్యం స్త్రీ అండంలోకి) ఉత్పత్తికోసం చేసే క్రియనే “కర్మ” అంటారు.
శ్లోకం 4
అధిభూతం క్షరో భావః పురుషాశ్చ అధిదైవతం । అధియజ్ఞోఽహం ఏవాత్ర దేహే దేహభృతాం వర ॥
ఓ శరీరదారులలో శ్రేష్ఠుడా ! అధిభూతం (ఐశ్వర్యార్థులు తెలుసుకోవాల్సింది (భౌతిక సంపద కోరుకునే వారు)) అనగా (శ్రేష్ఠమైన) శబ్దం మొదలైనవి (భౌతిక సుఖాలు) మార్పు చెందటానికి సహజమైన విషయం; అధిదైవతం (అది మళ్ళీ వారికి తెలుసుకోవాల్సింది ) అనగా పురుష (దేవత) ఇంద్రాది దేవతలకన్నా గొప్పవాడు. అధియజ్ఞం (మూడు రకాల భక్తులు తెలుసుకోవాల్సిన) అనగా నేను, యజ్ఞాల చేత పూజించ బడేవాడను, ఇంద్రాది దేవతలకు అంతర్యామి (అన్నిటిలో జీవించే పరమాత్మ), నాకు శరీరంగా ఉన్నవారు.
శ్లోకం 5
అంతకాలే చ మామ్ ఏవ స్మరన్ ముక్త్వా కాళేబరం । యః ప్రయాతి స మధ్భావం యాతి నాస్త్యత్ర సంశయః ॥
ఎవరు అయితే నన్ను ధ్యానిస్తూ శరీరం త్యజిస్తారో (తను కోరుకునే ఫలితాలు తో పాటు) తన అంత్యకాలం లో కూడా (తను అనుకున్న ఫలితాలు పొందుతూ), నా స్థితి సాధిస్తారు; దీనిలో సందేహము లేదు.
వివరణం : ఈ శ్లోకం మరియు తర్వాత రెండు శ్లోకాల్లో, కృష్ణుడు అంతిమ స్మృతి (శరీరం త్యాజించే సమయం లో చివరి అలోచనాలు).
శ్లోకం 6
యం యం వాఽపి స్మరన్ భావం త్యజాత్యంతే కళేబరం । తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావభావితః ॥
ఓ అర్జున! ఎప్పుడైతే ఒకరు శరీరం త్యజిస్తు, ఏ స్థితిని అయితే వారు ధ్యానిస్తారో; అతను ఆ స్థితిని పొందుతాడు;(ఎందుకు అంటే) వాళ్లు అన్ని వేళలా అదే ధ్యానించారు కదా.
శ్లోకం 7
తస్మాత్ సర్వేశు కాలేషు మామ్ అనుస్మర యుద్య చ । మయ్యర్పిత మనోబుద్ధీర్ మామ్ ఈవైశ్యస్యసంశాయాః ॥
కావున, నువ్వు ఎల్లవేళలా(మరణం వరకు) నా గురించే ఆలోచిస్తూ; యుద్ధం లో పాల్గొను; (ఈ విధముగా) మనసు మరియు బుద్ధి నా పైన కేంద్రీకరించి, నన్ను పొందుతావు(నువ్వు కోరిన విధం గా); దీంట్లో సందేహం లేదు.
వివరణం : ఈ శ్లోకం, నిరంతరం కృష్ణ ధ్యానం అంతిమ స్మృతి పొందేందుకు ఉపాయముగా సూచించబడింది.
మిగిలిన శ్లోకాల్లో, 15వ శ్లోకం మొదలు, కృష్ణుడు ఐష్ణ్వర్యార్థులు, కైవల్యార్థులు మరియు భగవత్ కైంకర్యార్థులు పొందే ఫలితాల స్వభావం వివరిస్తున్నారు.
శ్లోకం 15
మామ్ ఉపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం । నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ॥
అటువంటి జ్ఞానులు, మహాత్ములు, నన్ను (పరమ ప్రాప్యం) పొందిన వారు, నన్ను పొందాక, దుఃఖాలకు నిలయం అయిన ఈ (భౌతిక) అశాశ్వతమైన శరీరాన్ని తిరిగి పొందరు.
వివరణం : ఇక్కడ, అతను జ్ఞానులు పొందే ఫలితం శాశ్వతం మరియు ఉత్తమమైనది అని స్థాపిస్తున్నారు.
శ్లోకం 16
ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోఽర్జున । మామ్ ఉపేత్య తు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే ॥
ఓ అర్జున! బ్రహ్మ లోకం వరకు అన్ని లోకాలు (బ్రహ్మాండం లోని లోకాలు, 14 లోకాల్లో, బ్రహ్మలోకం అన్నిటి పైన) నశ్యమైనది; ఓ కుంతి పుత్రుడ! కానీ నన్ను పొందాక, పునర్జన్మ మళ్లీ ఉండదు.
వివరణం : జ్ఞానులు పొందే ఫలితం ఎందుకు శాశ్వతం అని కారణం స్థాపిస్తున్నాడు.
17వ శ్లోకం లో, బ్రహ్మ కు ఒక్క రోజు వెయ్యి చతుర్ యుగాలు మరియు ఒక్క రాత్రి కూడా అంతే సమయం అని వివరించబడింది. తర్వాత రెండు శ్లోకాల్లో, ఈ 14 లోకాల లో ఉన్న వస్తువులు అన్ని అశాశ్వతం అని వివరిస్తున్నాడు.
20 వ శ్లోకం మరియు 21 వ శ్లోకం లో, కృష్ణుడు, కైవల్యార్థులు పొందే ఫలితం కూడా అశాశ్వితం అని వివరిస్తున్నాడు.
శ్లోకం 22
పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్ త్వనన్యయా । యస్యాంతస్థాని భూతాని యేన సర్వం ఇదం తథం ॥
ఓ కుంతి కుమార! ఏ పరమపురుషుడిలో అన్ని జీవులు ఉన్నాయో, ఎవరి వల్ల అవి వ్యాపించాయో, ఆ పరమపురుషుడు విశిష్ట భక్తి తో పొందుతారు.
వివరణం : ఇక్కడ, కృష్ణుడు భక్తి యోగం యొక్క విశిష్టత మరియు భగవానుడి శాశ్వత కైంకర్యం దానితో సాధ్యమని వివరించారు.
23 మరియు 24 వ శ్లోకం లో, మోక్ష మార్గాలు అయిన జ్యోతి మార్గం, అర్చిరాది గతి వివరించారు.
25వ శ్లోకం లో, పుణ్యం చేసిన వారికి మార్గమైన ధూమ మార్గం, (ధూమాధి గతి), వివరించారు. స్వర్గ సుఖాలు అనుభవించాక తిరిగి వారు భూలోకం చేరి తాను ఎక్కడ విడిచి పెట్టాడో అక్కడ నుండే తిరిగి ప్రారంభించాలి.
26 వ శ్లోకంలో, అర్చిరాది గతి లో ప్రయాణించే వారి ఫలితం శాశ్వతం అని ధూమధి గతి లో ప్రయాణించే వారి ఫలితం అశాశ్వతం అని వారు పొందే ఫలితాలు యొక్క స్వభావం వివరించబడింది.
27 వ శ్లోకం లో, అర్జునుడిని అర్చిరాది గతి పైన ధ్యానించమని కృష్ణుడు నిర్దేశిస్తున్నాడు.
శ్లోకం 28
వేదేశు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్ఠం । అత్యేతి తత్ సర్వం ఇదం విధిత్వ యోగి పరం స్థానం ఉపైతి చాద్యం ॥
శాస్త్రం లో విధించబడ్డ, వేదాలు పటించటం చేత, యజ్ఞాలు ఆచరించటం చేత, వివిధ తపస్సులు మరియు దానాలు చెయ్యటం చేత, భక్తి యోగం అనుసరించటం చేత (జ్ఞానులు అయ్యి) సంపాదించిన పుణ్యం చేత నా (పరమపురుషుడు) వైభవం తెలుసుకుంటారు, ఇవి ఈ 2 అధ్యాయాల్లో (7వ మరియు 8వ) మరియు ఈ జ్ఞానం చేత అన్ని ఫలితాలను అధిగమించి, పురాతనమైన , ప్రారంభం లేని ఉత్తమమైన శ్రీవైకుంఠ లోకాన్ని పొందుతారు (శ్రీమన్నారాయణుడి దివ్య నివాసము)
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
మూలము : https://githa.koyil.org/index.php/essence-8/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org