శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ
శ్లోకం
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ||
ప్రతి పదార్థం
భీష్మ ద్రోణ ప్రముఖతః – భీష్ముడు, ద్రోణాచార్యుడు మొదలైనవారి ఎదుట
సర్వేషాం చ మహీక్షితామ్ – మరియు సమస్త భూపాలుర (రాజుల) ఎదుట
పార్థ – ఓ పృథా పుత్రుడా! (కుంతీదేవి కుమారుడవైన అర్జునా!)
సమవేతాన్ – సమకూడిన / చేరిన
ఎతాన్ కురూన్ – ఈ కౌరవులను (దుర్యోధనుడు మరియు కౌరవపక్షాన ఉన్న రాజులందరినీ)
పశ్య – తిలకించు / చూడుము
ఇతి – అని
ఉవాచ – పలికెను
తాత్పర్యం
(గత శ్లోకానికి కొనసాగింపుగా – రథాన్ని భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర సమస్త రాజుల ఎదుట నిలిపి, శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను) “ఓ పార్థా! ఇక్కడ యుద్ధం చేయడానికి సమకూడిన దుర్యోధనుడిని మరియు కౌరవపక్షాన ఉన్న ఈ రాజులందరినీ ఒక్కసారి చూడుము!”
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-25
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org