శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 10 (విభూతి విస్తార యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ భగవద్ గీతా సారం

<< అధ్యాయం 9

గీతార్థ సంగ్రహం లోని 14వ శ్లోకం లో, ఆళవందార్లు పదవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “పదవ అధ్యాయం లో, సాధన భక్తిని (భగవానుడిని పొందే సాధనం గా భక్తి యోగం) వ్యక్తం పరిచే మరియు పోషించే మార్గం, భగవానుడి అసంఖ్యాక కళ్యాణ గుణాలు, తానే సర్వ నియామకుడు అనే జ్ఞానం వివరించబడింది.

ముఖ్యమైన శ్లోకం

శ్లోకం 1

శ్రీభగవాన్ ఉవాచ. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః । యత్ తేఽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యాయ ॥

శ్రీ భగవానుడు చెప్తూ – ఓ మహాబాహు! నీ శ్రేయసు (నా పై భక్తి పొంది పెంచే విధము గా), సంతోషము (నా వైభవం వినటం చేత) పొందిన నీతో తిరిగి మాట్లాడుతున్నాను ఈ సంక్షిప్తమైన ఉపన్యాసం (నా వైభవాలు వివరించేది) శ్రద్ధగా విను.

వివరణం : అర్జునుడు కృష్ణుడి మాటలు విని సంతోషం కనపరిచాడు, కృష్ణుడు అత్యంత కృప తో తిరిగి జ్ఞానం చెప్తున్నాడు.

2వ శ్లోకం లో కృష్ణుడు ఈ అధ్యాయం లో చెప్పబోయే జ్ఞానం యొక్క గొప్పతనం వివరిస్తున్నాడు.

శ్లోకం 3

యో మామ్ అజం అనాదిమ్ చ వేత్తి లోకమహేశ్వరం । అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ॥

మర్త్యుల లో ఎవరు అయితే సంకోచించని వారు నన్ను ఇతరులతో సమానం కాదు అని తెలుసుకున్న వారు, నాకు జన్మం లేదు, అనాది గా జన్మ లేనివాడిగా మరియు లోకేశ్వరులకు ఈశ్వరుడను అని గుర్తించువారు, సమస్త పాపాల (భక్తి మార్గం లో అడ్డంకులు ) నుండి విముక్తులు అవుతారు

వివరణం : భగవానుడి పూర్ణ స్వరూపం తెలిసిన వారే, పాప విముక్తులు అవుతారు.

4వ మరియు 5వ శ్లోకం లో, అనేక గుణాలు(అవ గుణాలు కూడా) తన సంకల్పం తో సిద్ధిస్తాయి అని వివరిస్తున్నారు.

6వ శ్లోకం లో, గొప్ప మహత్ములు ,సప్తర్షులు కూడా తన ఆజ్ఞను పాటిస్తున్నారు అని వివరిస్తున్నారు.

7వ శ్లోకం లో, ఎవరైతే తన నిజమైన సంపద తెలుసుకున్న వారు, భక్తి యోగం లో స్థిరం గా ఉంటారు అని వివరిస్తున్నారు.

శ్లోకం 8

అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే । ఇతి మత్వా భజంతే మామ్ బుధా భావసమాన్వితాః ॥

నేను సమస్త లోకాలకు ఆది మరియు అన్ని జీవులు నా నుండే నిర్వహించబడుతాయి. నా స్వభావమైన అన్యాక్రాంతం కాని సంపద మరియు కళ్యాణ గుణాల పైన ధ్యానిస్తూ, జ్ఞానులు, నన్ను అత్యంత ప్రేమ తో ఆరాధిస్తారు.

శ్లోకం 9

మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరం । కథయంతశ్చ మామ్ నిత్యం తుష్యంతి చ రమంతి చ ॥

(నా భక్తులు) వారు మనసు నా పైన లగ్నం చేసి, వారి ప్రాణం నా పైన కేంద్రీకరించి, ఒకరికొకరు చెప్తూ (నా గుణాలు అనుభవిస్తూ) ఎల్లప్పుడు నా గురించి మరియు నా లీలలు ధ్యానిస్తూ, శ్రోతలు మరియు చెప్పేవారు ఇద్దరూ సంతోషిస్తారు.

శ్లోకం 10

తేశాం సతతయుక్తానాం భజంతాం ప్రీతిపూర్వకం । దాదామి బుద్ధియోగం తం యేన మామ్ ఉపయాంతి తే ॥

ఎవరు అయితే (నాతో) కలిసి ఉండాలి అని కోరుకుంటారో మరియు నా పై (నిష్కామ)భక్తి కలిగి ఉంటారో, నేను ఆనందం గా వారికి నన్ను చేరే మార్గం అయిన జ్ఞానం(పరమ జ్ఞానం అను పిలవబడే) ప్రసాదిస్తాను.

శ్లోకం 11

తేశాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః । నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వతా ॥

ఈ నిష్కామ భక్తి యోగ నిష్ఠులు (భక్తి యోగం పాటిస్తున్నారు), నా కరుణ చేత మాత్రమే, వారి హృదయం లక్ష్యము గా కలిగి, నేను వారి అనాది పాపాల వల్ల కలిగే అజ్ఞాన అంధకారం నాశనం చేసి వారిలో జ్ఞాన జ్యోతి ప్రజ్వలిస్తాను.

వివరణం : ఈ 3 శ్లోకాల్లో, కృష్ణానుగ్రహం చేత భక్తి లో పురోగతి కలుగుతుంది అని వ్యక్తపరిచారు.

తర్వాత 7 శ్లోకాల్లో, అర్జునుడు కృష్ణ వైభవం విని ఆశ్చర్యం కలిగింది, అతనికి అర్థం అయ్యింది వివరించారు మరియు కృష్ణుడిని తన సంపద(అన్ని పదార్థాల పైనా ఉన్న అధికారం మరియు గుణాలు) ని దర్శింపచెయ్యాలి అని ప్రార్థించారు.

19 వ శ్లోకం లో, కృష్ణుడు సంపద గురించి మాట్లాడేందుకు ఒప్పుకున్నాడు కాని దానికి అంతం లేదని హెచ్చరించాడు.

శ్లోకం 20

అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాషయస్థితః । అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ ॥

ఓ అర్జున (నిద్ర జయించిన వాడా)! నేను అంతర్యామి గా ప్రతి ప్రాణుల హృదయం లో వసిస్తాను. సమస్త ప్రాణులకు నేను మొదట సృష్టి కారకుడను, వారిని ధారకుడను, చివర్లో వారిని లయం చేస్తాను.

వివరణం : మొదట తాను సమస్త ప్రాణుల పైన అధికారిని అని స్థాపిస్తున్నాడు.

21 వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు, పదార్థాల సమూహం లో శ్రేష్ఠమైన పదార్థాలని ఎన్నుకుని, తానే ఆ పదార్థం అని స్థాపిస్తున్నారు.

శ్లోకం 41

యాద్ యద్ విభూతిమత్ సత్వం శ్రీమద్ ఊర్జితం ఏవ వా । తత్ తదేవావగచ్చా త్వం మామ తేజోఽమ్శ సంభవం ॥

ఏ ప్రాణికి అయితే కీర్తి తన అదుపు లో కలిగి ఉంటుందో, ప్రకాశం కాలిగి మరియు శుభప్రదమైనవి ఆరంభించాలి అని నిర్ణయించ బడిందో, నువ్వు తెలుసుకో ఆ ప్రాణికి ఆ శక్తి నా సర్వ నియామకత్వపు అంశము గా కలిగింది అని.

శ్లోకం 42

అత వా బహునైతేన కిమ్ జ్ఞానేన తవార్జున । విషతభ్యాహం ఇదం కృత్స్నం ఈకాంశేన స్థితో జగత్ ॥

ఓ అర్జున! అనేక విధాలుగా ఈ జ్ఞానాన్ని వివరించటం వల్ల నీకు ఏం ఉపయోగం? నేను నా శక్తులల్లో ఒక వంతు తో మాత్రమే ఈ సమస్తమైన లోకాలని ధరిస్తున్నాను.

వివరణం : చివరికి, తన శక్తులు అసంఖ్యాకం అని, పదాలతో వాటికి న్యాయం చేకూరదు అని ముగిస్తున్నారు.

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

మూలము : https://githa.koyil.org/index.php/essence-10/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org