శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
గీతార్థ సంగ్రహం లోని 19వ శ్లోకం లో, ఆళవందార్లు పదిహేనవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “పదిహేనవ అధ్యాయం లో, పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణయుడు గురించి చెప్ప బడింది. తను అచిత్ (సంసారిక దేహం) కు వశమైన బద్ధ జీవాత్మ మరియు ప్రాకృత శరీరాన్ని త్యజించిన ముక్త జీవాత్మ కన్నా వేరు, వారిలో వ్యాపించిన వాడు, వారిని ధరిస్తూ, వారికి నాయకుడై ఉన్నందున వారి కన్నా ఉత్తముడు అని చెప్పబడింది”.
శ్లోకం 1
శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలం అదశ్శాఖం అశ్వత్థం ప్రాహుర్ అవ్యయం । చందాంసి యస్య పర్ణానియస్ తం వేదస వేదవిత్ ॥
భగవాన్ చెప్తూ – ఎవరు అయితే సంసారాన్ని ఒక్క రావి చెట్టు గా తెలుసుకుంటారో, దాని వేర్లు పైన ఉన్నాయి మరియు దాని శాఖలు క్రిందకి విస్తరించి ఉన్నాయి (తలకిందుల గా ఉన్నది), ఇది అనశ్యమైనది (నిరంతరం ఉన్నందున), దానికి వేద వాక్యాలు ఆకులు గా కలిగి ఉంది. (వేదంలో చెప్పిన విధంగా), వారు వేదం తెలిసిన వారు.
వివరణం: భగవానుడు సంసారాన్ని రావి చెట్టుగా వర్ణించారు.
2వ మరియు 3వ శ్లోకం లో, భగవానుడు సంసారం అనే చెట్టు విస్తారాన్ని ఇంకా వివరించారు
3వ శ్లోకం 2వ భాగం మరియు 4వ శ్లోకం మొదటి భాగం లో, సంసారిక విషయాల పట్ల వైరాగ్యం అనే గొడ్డలి సంసారం అనే చెట్టు కొట్టేయటానికి ప్రధాన ఆయుధం మరియు శాశ్వతత్వం పొందే మార్గం
4వ శ్లోకం 2వ భాగం లో, భగవానుడికి శరణాగతి చెయ్యటమే అజ్ఞానం తొలిగించే ఉపాయం ఇత్యాది.
5వ శ్లోకం లో, గత శ్లోకం లో చెప్పిన దాన్ని విస్తారం గా వివరించారు.
శ్లోకం 6
నా తాద్ భాసయతే సూర్యో న శశాంకో నా పావకః । యద్ గత్వా న నివర్తంతే తద్ ధామ పరమం మమ ॥
తిరిగి రాని లోకానికి చేరిన జీవాత్మ, వెళ్ళిన ప్రదేశం సూర్యుడిచేతో, చంద్రుడిచేతో, లేక అగ్ని చేతో ప్రజ్వలించబడదు. ఆ ప్రదేశం భగవానుడి ప్రకాశం చేత వెలుగుతుంది.
శ్లోకం 7
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః । మనఃషష్ఠాన్ఇంద్రియాణి ప్రకృతిస్తాని కర్షతి ॥
జీవాత్మ అనాది గా ఉంది, నా లక్షణాలు ఉన్న ఈ జీవాత్మల నడుమ ఉన్న కారణం చేత , ఈ లీల విభూతి లో ఉన్న కారణం చేత, బద్ధ జీవులు వసించే చోట ఉండటం వల్ల; అటువంటి ఆత్మ ప్రకృతి వల్ల ఏర్పడిన శరీరంలో ఉన్న మనసుని మరియు 5 జ్ఞానేంద్రియాలు (చర్మం, నోరు, కళ్లు, ముక్కు, చెవులు) లను పనిచేయిస్తుంది.ఇది ప్రకృతి (పదార్థం) యొక్క ప్రభావం.
8వ శ్లోకం లో, జీవాత్మ ఒక్క శరీరం నుండి ఇంకో శరీరానికి ఇంద్రియాలను తీసుకుని వెళ్ళటం వివరించారు.
9వ శ్లోకం లో జీవాత్మ ఈ ఇంద్రియాల ద్వారా భౌతికమైన విషయాలని అనుభవిస్తుంది అని వివరించారు.
10వ మరియు 11వ శ్లోకాల్లో, కృష్ణుడు ఈ క్లేశానికి కారణం ఆత్మ తాను స్వతంత్రుడిగా భావించడమేనని వివరించాడు. మరియు ఎందుకు కొన్ని ఆత్మలు తమ నిజ స్వభావాన్ని గ్రహిస్తున్నాయి ఎందుకు కొన్ని గ్రహించవు అని వివరిస్తున్నారు.
12వ శ్లోకం లో, వెలిగే పదార్థాల్లోని వెలుగు తానే అని వివరిస్తున్నారు.
13వ శ్లోకం లో, తను భూమి అంతా వ్యాపించి ఉన్నట్టు, అన్నిటికీ ఆధారం అని మరియు చంద్రుడిగా తానే పోషిస్తున్నాడు అని వివరిస్తున్నారు.
14వ శ్లోకం లో, తను జటరాజ్ని(జీర్ణించే అగ్ని) గా ఉంటూ అన్ని రకాల ఆహార పదార్థాల్ని శరీరం జీర్ణించుకునేందుకు సహాయ పడతాడు అని వివరించారు.
శ్లోకం 15
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ । వేదైశ్చ సర్వైరహం ఏవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చాహం ॥
నేను అన్ని ప్రాణుల హృదయంలోకి ఆత్మగా చేరి అక్కడ వసిస్తున్నాను; జ్ఞాపకశక్తి, వస్తువులను గుర్తించే జ్ఞానం మరియు మరుపు నా నుండే కలుగుతాయి; నేనే అన్ని వేదాలు తెలిపే వాడిని;నేను వేద నిర్దేశ ఫలాలను అందించేవాడిని మరియు వేదాన్ని తెలిసినవాడిని మాత్రమే.
శ్లోకం 16
ధ్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్ చాక్షర ఏవ చ । . క్షరః సర్వాణి భూతాని కూటస్తోఽక్షర ఉచ్యతే ॥
శాస్త్రం లో, రెండు రకాల ఆత్మలు వివరించబడ్డాయి అవి క్షర – బద్ధ జీవాత్మలు ( నశ్వరమైన భౌతిక శరీరం కలిగిన వారు) మరియు అక్షర – ముక్త జీవాత్మలు (అనశ్యమైన సూక్ష్మ శరీరం కలిగిన వారు). అన్ని బద్ధ ఆత్మలు క్షర పురుషులుగా, ముక్తాత్మలు(సంసారిక బంధం లేని వారు) అక్షర పురుషులుగా గుర్తించబడుతారు.
శ్లోకం 17
ఉత్తమః పురుషాస్ త్వన్యః పరమాత్మేత్యుదాహృతః । యో లోకత్రయం ఆవిష్య బీభార్త్యవ్యాయ ఈశ్వరః ॥
కానీ ఎవరైతే అన్నిటిలో వ్యాపించి మరియు మూడు రకాల పదార్థాలను అనగా అచిత్ (పదార్థాలు), బద్ద జీవాత్మలు మరియు ముక్తాత్మలకు ఆధారమో, ఎవరు అయితే నాశనం లేని వాడో, నియమకుడో, మరియు శాస్త్రం ద్వారా పరమాత్మగా (సర్వోన్నతుడిగా) చెప్పబడ్డాడో, (ఈ కారణాల చేత) అన్నిటి నుండి వేరైన వాడు(క్షర, అక్షర పురుషుల గురించి ముందు చెప్పిన విధముగా).
శ్లోకం 18
యస్మాత్ క్షరం అతీతోఽహం అక్షరాద్ అపి చోత్తమః । అతో స్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః ॥
నేను క్షర పురుషులను(బద్ధ ఆత్మలు) అతిశయిస్తున్నందున మరియు అక్షర పురుషులకు అధికుడను(ముక్త ఆత్మలు) కాబట్టి, నేను శ్రుతి, స్మృతులలో పురుషోత్తముడిగా స్తుతించబడ్డాను.
19వ శ్లోకం లో, ఎవరైతే తనను నిజముగా తెలుసుకున్నవారు తనని పొందే మార్గం తెలుసుకుంటారు మరియు వారు అతనిని అన్ని విధములుగా సేవలు చేస్తారు.
శ్లోకం 20
ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయానఘ । ఎతద్ బుద్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యాశ్చ భారత ॥
ఓ పాపరహితుడా! ఓ భరత వంశజుడా! ఈ విధముగా, ఈ అత్యంత రహస్యమైన గ్రంథం, పురుషోత్తమ విద్యా, నాచే నీకు ఉపదేశించబడింది, ఇది తెలుసుకుని, నన్ను పొందేంత జ్ఞాని అవుతారు మరియు పొందేందుకు సాధించాల్సిన కార్యాలు సాధిస్తారు.
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
మూలము : https://githa.koyil.org/index.php/essence-15/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org